ముగ్గురి రిమ్స్ ఉద్యోగులపై క్రిమినల్ కేసు
శ్రీకాకుళం: ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఓ ముగ్గురు రిమ్స్ ట్రామా కేర్ కాంట్రాక్ట్ ఉద్యోగులపై క్రిమినల్ కేసు నమోదైంది. వారు ఆరోగ్య శాఖలో ఉద్యోగం కోసం ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు తెలిసింది.
దాంతో ఫోర్జరీ చేసిన ముగ్గురిపై క్రిమినల్ కేసు పెట్టినట్టు రిమ్స్ డైరెక్టర్ జయరాజు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.