చంద్రబాబు ఎంతకైనా దిగజారతారు: రామకృష్ణ
విజయవాడ: అధికారం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనమని అన్నారు.
'ఎమ్మెల్యేలనే కాదు.. ఎంపీటీసీలు, జడ్పీటీసీలను సైతం కొనుగోలు చేస్తూ చంద్రబాబు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు' అని రామకృష్ణ మండిపడ్డారు. సంతలో పశువుల్లా ప్రజాప్రతినిధులను కొనడం బాబుకు అలవాటైపోయిందని అన్నారు.