సిట్ విచారణతో ప్రయోజనం లేదు
విశాఖపట్నం: విశాఖ భూకబ్జాలపై ప్రభుత్వం జరిపిస్తున్న సిట్ విచారణతో ఎలాంటి ప్రయోజనం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి స్టాలిన్ అన్నారు. గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'సేవ్ విశాఖ' మహాధర్నాలో పాల్గొన్న ఆయన విశాఖ భూ కబ్జాలపై మండిపడ్డారు.
మూడేళ్లుగా తెలుగుదేశం పార్టీ నేతలు భూములు కొల్లగొడుతున్నారని స్టాలిన్ ఆరోపించారు. ప్రైవేటు, ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించారని.. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిగితేనే వాస్తవాలు బయటకు వస్తాయని అన్నారు.