విద్యుత్ షాక్‌తో దంపతుల మృతి


వైఎస్సార్ జిల్లా: టేబుల్ ఫ్యాన్ పక్కకు జరుపుతూ ప్రమాదవ శాత్తూ విద్యుదాఘాతానికి గురై భార్యాభర్తలు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన వైఎస్సార్‌జిల్లా అట్లూరు మండలం ఎస్ వెంకటాపురం గ్రామంలోని మల్లినేనిపట్నం కాలనీలో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన కె. నరసింహులు (50), ఆయన భార్య సుబ్బలక్ష్మమ్మ (45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.



ఈ క్రమంలో పడుకునే సమయంలో టేబుల్ ఫ్యాన్‌ను పక్కకు జరుపుతుండగా.. సుబ్బలక్ష్మమ్మకు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఆమెను కాపాడే ప్రయత్నంలో నరసింహులుకు కూడా షాక్ కొట్టడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. సోమవారం ఉదయం స్థానికులు చూడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృత్యువాతపడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top