రైలుకిందపడి భార్యభర్తల ఆత్మహత్య
మార్కాపురం రైల్వేస్టేషన్లో రైలు కిందపడి భార్యభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. మృతులు మార్కాపురం పట్టణానికి చెందిన గోతుశెట్టి శ్రీనివాసులు(30), గోతుశెట్టి సుభద్ర(25)లుగా గుర్తించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. సంఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.