ఆంధ్రప్రదేశ్ శాసనమండలి నిరవధిక వాయిదా


హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఐదు రోజుల పాటు జరిగిన శాసనమండలి సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి.  ఐదు రోజుల్లో 20 గంటల 15 నిమిషాలు మాత్రమే శాసనమండలి సమావేశాలు జరిగాయి. 


 


ఏపీ శాసనమండలిలో తొమ్మిది బిల్లులు, రెండు తీర్మానాలకు ఆమోదం లభించింది. కొన్ని బిల్లుల సవరణలకు తగిన సమయం ఇవ్వకుండా సభలో ప్రవేశపెట్టడం సరికాదని కొంతమంది సభ్యులు అభిప్రాయపడుతున్నారు. నీటి సంఘాల బిల్లు అప్రజాస్వాకమని విపక్ష వైఎస్సార్ సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top