ఆధునిక చికిత్సతో క్షయ వ్యాధి నిర్మూలన
కర్నూలు(హాస్పిటల్):
ఆధునిక చికిత్సతో క్షయ వ్యాధిని నిర్మూలించవచ్చని కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్.రాంప్రసాద్ తెలిపారు. మంగళవారం ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని డీహెచ్వో కార్యాలయంలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ పి.మోక్షేశ్వరుడు అధ్యక్షత వహించారు. అంతకు ముందు క్షయవ్యాధి కార్యాలయంలో రాబర్ట్కోచ్ విగ్రహాన్ని వైద్యకళాశాల ప్రిన్సిపాల్ జీఎస్ రాంప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ..బీసీజీ టీకాలు వంద శాతం నమోదు చేయడం ద్వారా క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చన్నారు. ఎక్స్రే, సిటీస్కాన్, మైక్రో బయాలజీ విభాగాలు ఎంతో అభివృద్ధి చెందాయని, ఖరీదైన మందులను రోగులకు ఉచితంగా అందిస్తున్నారన్నారు. క్షయ రోగులపై ఆరోగ్య కార్యకర్తలు నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు.
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెం డెంట్ వీరస్వామి మాట్లాడుతూ.. ఈ వ్యాధిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి క్రమంగా మందలు వాడితే నయమవుతుందన్నారు. నిరక్షరాస్యత, పేదరికం వంటి అనేక కారణాలతో ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతున్నారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ శంకర్శర్మ అన్నారు. దగ్గు, జ్వరం వస్తుంటే వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని జిల్లా మలేరియా అధికారి హుసేన్ పీరా సూచించా రు. అనంతరం వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఉత్తమ ఎన్జీఓగా సేవలందించిన రాజేశ్వరీ మహిళా మండలికి చెందిన శైలజకు జ్ఞాపికను అందజేశారు. క్షయ రోగులు ఉచితంగా చీరెలు, దుప్పట్లు పంపిణీ చేశారు.
సంబంధిత వార్తలు