కార్పొరేటర్‌ భర్త హల్‌చల్‌


విజయవాడ: కృష్ణా జిల్లాలోని మొగల్‌రాజపురంలో కార్పొరేటర్‌ భర్త రత్నాకర్‌ హల్‌చల్‌ చేస్తున్నాడు. అక్కడ కొండపై నివశిస్తున్న వారు వెంటనే ఇళ్లు ఖాళీ చేయాలని వేదిస్తున్నాడు.



ఒకవేళ ఇళ్లు ఖాళీ చేయకపోతే రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీనికి అడ్డొచ్చిన వారిపై తన అనుచరులతో దాడి చేయించి, ఇళ్లను పడగొట్టించాడు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top