రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్టర్ మృతి


శింగరాయకొండ: ప్రకాశం జిల్లా శింగరాయకొండ వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. నెల్లూరు జిల్లాకు చెందిన దర్శి రత్నం(61) క్లాస్-1 కాంట్రాక్టర్. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. కుటుంబసభ్యులను కలిసేందుకని కారులో నెల్లూరు వెళ్తుండగా శింగరాయకొండ సమీపంలోని కలికివాయి గ్రామం వద్దఓవర్‌టేక్ చేసే క్రమంలో ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో కారు డ్రైవర్ తీవ్రగాయాలపాలుకాగా, రత్నం అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రుడిని శింగరాయకొండ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top