రోడ్డుప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
బెరైడ్డిపల్లి: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా బెరైడ్డిపల్లి మండలం కైగల్ గ్రామం వద్ద ఆదివారం జరిగింది. వివరాలు.. కారును ఓవర్టేక్ చేసే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఎస్.గజేంద్రన్ (34) అనే కానిస్టేబుల్ మృతిచెందాడు. గజేంద్రన్ ప్రస్తుతం తిరుమల టూటౌన్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.