పోలీస్ క్వార్టర్స్లో కానిస్టేబుల్ రాసలీలలు

పోలీస్ క్వార్టర్స్లో కానిస్టేబుల్ రాసలీలలు - Sakshi


హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లాలో ఓ కానిస్టేబుల్ కీచకుడిగా మారాడు. ఓ మహిళతో రాసలీలలు చేస్తూ పట్టుబడ్డాడు. జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న సతీష్.. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళను పోలీస్ క్వార్టర్స్కు పిలిపించుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ వ్యవహారాన్ని వీడియోలో చిత్రీకరించడంతో పై అధికారులు విచారణకు ఆదేశించారు.



మహిళల పట్ల సతీష్ ప్రవర్తన సరిగాలేదని గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. అతని ఆగడాలు భరించలేక ఒకరు ఆత్మహత్యాయత్నం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. జంగారెడ్డి గూడెం డీఎస్పీ సుబ్బరాజు.. సతీష్ రాసలీలల వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. విచారించి పైఅదికారులకు నివేదిక పంపిస్తామని, సతీష్పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాని చెప్పారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top