చంద్రబాబుపై ఉరవకొండ పీఎస్లో ఫిర్యాదు

చంద్రబాబుపై ఉరవకొండ పీఎస్లో ఫిర్యాదు - Sakshi


అనంతపురం: బ్యాంకులో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కోదండరాం మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడే కారణమంటూ ఉరవకొండ పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆదివారం ధర్నాకు దిగాయి. కోదండరాం మృతికి చంద్రబాబే కారణమంటూ డీసీసీ అధ్యక్షుడు  కోట సత్యనారాయణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.


జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. అయితే బ్యాంకులో ఆత్మహత్యు పాల్పడిన రైతు కోదండరాం మృతిపై ఆర్డీవో హుస్సేన్ విచారణ చేపట్టారు. బాధితుడి కుటుంబానికి రూ 5 లక్షల పరిహారం చెల్లిస్తామని ఆర్డీవో హుస్సేన్ హామీ ఇచ్చారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top