రెండు మ్యూజియంల డి జిటైజేషన్ పూర్తి


న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియం, నాగార్జునకొండలోని ఆర్కియాలజికల్ మ్యూజియంల డిజిటైజేషన్ పూర్తయినట్టు కేంద్ర పర్యాటక శాఖ తెలిపింది. మంగళవారం ఆ శాఖ మంత్రి శ్రీపాద్ యశోనాయక్ దేశంలోని 10 మ్యూజియంల డిజిటైజేషన్ వివరాలతో కూడిన పోర్టల్‌ను ప్రారంభించారు. వీటి లో సాలార్‌జంగ్ మ్యూజియం, నాగార్జునకొండ మ్యూజియం కూడా ఉన్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top