'రాణి దుర్గావతి'ని ప్రారంభించిన సతీష్ సోని
విశాఖ : భారత తీరప్రాంత రక్షణ కోసం విశాఖ హిందుస్థాన్ షిప్యార్డ్ నిర్మించిన ఐసీజీఎస్ 'రాణి దుర్గావతి' నౌకను తూర్పు నావికాదళం ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ సతీశ్ సోని సోమవారమిక్కడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2016 ఫిబ్రవరి 4 నుంచి 9వ తేదీ వరకూ అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (అంతర్జాతీయ నేవీ యుద్ధనౌకల ప్రదర్శన) జరుగుతుందన్నారు. 79 దేశాలను ఆహ్వానించామని, 37 దేశాల నేవీ చీఫ్లు, నౌకలు...ఈ ఫ్లీట్ రివ్యూకు వస్తున్నట్లు చెప్పారు.
ఫిబ్రవరి 7న సిటీ పరెడ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారని సతీష్ సోని తెలిపారు. విశాఖ-చెన్నై వరకు అన్నీ సెయిలింగ్ షిప్స్ పాల్గొనే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ నిర్వహించడం ఓ సువర్ణ అవకాశమని, విశాఖకు పర్యాటకంగా అంతర్జాతీయ గుర్తింపు వస్తుందన్నారు.