కలెక్టర్ ఇఫ్తార్ విందు
గుంటూరు ఎడ్యుకేషన్: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జిల్లా అధికార యంత్రాగం తరపున కలెక్టర్ కాంతిలాల్ దండే ముస్లింలకు ఆదివారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఇచ్చారు. స్థానిక ఇండియన్ టుబాకో బోర్డు అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ విందుకు హాజరైన ప్రజా ప్రతినిధులు, అధికారులు, ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, రాష్ట్ర మైనార్టీస్ ఆర్ధిక సహకార సంస్థ చైర్మన్ ఎండీ హిదాయత్, ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తఫా, కోన రఘుపతి, ధూళిపాళ్ళ నరేంద్ర, కొమ్మాలపాటి శ్రీధర్, యరపతినేని శ్రీనివాసరావు, తెనాలి శ్రావణ్కుమార్, జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్, జిల్లా రెవెన్యూ అధికారి కె.నాగబాబు, మాజీ ఎమ్మెల్యేలు షేక్ మస్తాన్ వలి, ఎస్ఎం జియావుద్దీన్, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ ఎం.వెంకట సుబ్బయ్య, పలువురు అధికారులు పాల్గొన్నారు.