'సీఎం రమేశ్ ఓ బ్రోకర్'


అనంతపురం: టిక్కెట్లు ఆశించి భంగపడిన తెలుగు తమ్ముళ్లు సీఎం రమేశ్ పై మండిపడుతున్నారు.  టీడీపీ నేత సీఎం రమేష్ ఓ బ్రోకర్‌ అని టీడీపీ నేత రాయల్ మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వార్డుకు మెంబర్‌గా గెలవలేని సీఎం రమేష్‌ రాయలసీమ జిల్లాల టికెట్లను ఎలా పంపిణీ చేస్తారని మురళి ప్రశ్నించారు.

 

రాయల సీమలో పలు నియోజకవర్గాల్లో టికెట్లు దక్కని నేతలు పార్టీ అధిష్టానంపై నిప్పులు చెరుగుతున్నారు. చాలా కాలంగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తమకు టికెట్ దక్కకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

 

ఇదిలా ఉండగా తూర్పు గోదావరి జిల్లా రాజోలు టీడీపీలో కూడా వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.  గొల్లపల్లి సూర్యారావుకు రాజోలు టికెట్ ఇవ్వడంపై  బత్తుల రాము వర్గీయుల ఆందోళన చేపట్టారు. టీడీపీ పార్టీ సమావేశంలో బత్తుల రాము కంటతడి పెట్టారు. 

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top