రాజధాని నిర్మాణ పనులపై సీఎం సమీక్ష


అమరావతి: సీఆర్‌డీఏ సమావేశంలో రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. శాఖమూరు పార్క్‌ ఆకర్షణలపై ఏడీసీ ప్రెజెంటేషన్ ఇచ్చింది. వైల్డ్ లైఫ్‌కు ఇబ్బంది లేకుండా నైట్ సఫారీ కోసం జురాంగ్ పార్క్ తరహాలో పార్క్‌ను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. విజయవాడ రివర్ ఫ్రంట్, కెనాల్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏడీసీ అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు.

 

రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ నుంచి కనకదుర్గ గుడికి వెళ్లే మార్గాలను ఆహ్లాదంగా, ఆకర్షణీయంగా ఉండేలా తీర్చిదిద్దే ప్రణాళికను ఏడీసీ అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, కనకదుర్గ గుడి నుంచి నిత్యం లక్షన్నర మంది రాకపోకలు సాగిస్తున్నారని, వారందరినీ ఆకట్టుకునేలా ఈ జోన్‌లో ప్రత్యేక ఆకర్షణలు ఉండాలని సీఎం సూచించారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top