'ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనత బాబుదే'
తణుకులో జరుగనున్న రైతుదీక్షకు వెళ్లే వాహనాలను అనంతపురం వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి శుక్రవారం జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గుర్నాథ్రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందని ఆయన అన్నారు.
ఎన్నికల ముందు 200 హామీలిచ్చిన చంద్రబాబు ... సీఎం అయ్యాక వాటిని విస్మరించారని ఆయన ఆరోపించారు. హామీలు అమలు చేయని కారణం వల్ల ప్రజలు బాబుపై ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. అందుకే అన్ని వర్గాల ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రైతు దీక్షకు మద్దతు తెలుపుతున్నారని గుర్నాథ్రెడ్డి అన్నారు.