ఐదు రోజుల పాటు చిరుధాన్యాల ప్రదర్శన


సాక్షి, హైదరాబాద్ : వర్షాభావ పంటలు పండించే రైతులను ప్రోత్సహించడానికి చిరు ధాన్యాల ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య గురువారం తెలిపారు. ఈ ప్రదర్శన ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు చెప్పారు. రాగి, జొన్న, సజ్జ తదితర చిరుధాన్యాలు పండించే రైతులకు సదస్సు కూడా నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top