సీఐడీ చీఫ్‌కు రాష్ట్రపతి పోలీసు పతకం

సీఐడీ చీఫ్‌కు రాష్ట్రపతి పోలీసు పతకం - Sakshi


సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) చీఫ్‌గా ఉన్న అదనపు డీజీ సీహెచ్ ద్వారకా తిరుమలరావుకు రాష్ట్రపతి పోలీసు పతకం లభించింది. ఈయనతో పాటు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీసు (ఏపీఎస్పీ) బెటాలియన్స్ అదనపు డీజీ దామోదర్ గౌతమ్ సవాంగ్, మావోయిస్టు వ్యతిరేక నిఘా విభాగం (ఎస్‌ఐబీ) చీఫ్‌గా ఉన్న డీఐజీ బి.శ్రీనివాసులకు కూడా ఈ పతకాలను కేంద్రం ప్రకటించింది.



అలాగే సీఎం ముఖ్య భద్రతాధికారి ఎం.నాగేందరరావును ఇండియన్ పోలీస్ మెడల్ వరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఆదివారం వీటిని ప్రకటించింది. రాష్ట్ర పోలీసు విభాగంలో పని చేస్తున్న మొత్తం 32 మందికి వివిధ పతకాలు లభించాయి. ఈ అధికారులను అభినందించిన డీజీపీ జాస్తి వెంకట రాముడు ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.

 

ఇండియన్ పోలీసు మెడల్ పొందిన వారు: జె.ప్రసాదరావు (డీఐజీ-3, కర్నూలు ఏపీఎస్పీ), డి.కోటేశ్వరరావు (నాన్-క్యాడర్ ఎస్పీ, సీఐడీ), బి.అచ్యుతరావు (అదనపు ఎస్పీ), షేక్ అల్లా భక్షు (డీఎస్పీ, ఇంటెలిజెన్స్), ఎ.వెంకటరావు (ఇన్‌స్పెక్టర్, విశాఖపట్నం), డి.ధనుంజయరెడ్డి (ఆర్‌ఎస్సై, పీటీసీ అనంతపురం), వి.వెంకటనారాయణ (ఏఎస్సై, గుంటూరు ఎస్బీ), బి.నర్సయ్య (ఏఎస్సై, ప్రొద్దుటూరు ట్రాఫిక్ పీఎస్), కె.రామచంద్రరావు (ఏఆర్‌ఎస్సై, విజయవాడ సిటీ), డీసీహెచ్ కుల్లయ్యప్ప (ఏఆర్‌ఎస్సై, కడప), డి.సత్యనారాయణ (ఎస్సై, ఏలూరు రేంజ్), యు.సుందరబాబు (హెడ్-కానిస్టేబుల్, మంగళగిరి ఏపీఎస్పీ), మహ్మద్ హమీద్ ఖాన్ (హెడ్-కానిస్టేబుల్, విశాఖ రేంజ్ ఏసీబీ), కేఎస్‌ఆర్‌ఎం చక్రవర్తి (హెడ్-కానిస్టేబుల్, కుప్పం పీఎస్).

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top