మద్యం మత్తులో సీఐ వీరంగం


నెల్లూరు: మద్యం మత్తులో ఓ పోలీస్ అధికారి వీరంగం సృష్టించిన ఘటన నెల్లూరు జిల్లాలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. నగరంలోని రామలింగాపురం ప్రాంతంలో ఓ సీఐ మద్యం మత్తులో వాహనాన్ని నడిపి స్థానికులను భయాందోళనలకు గురి చేశాడు. సీఐ కారు ఢీ కొన్న ఘటనలో మూడు ఆటోలు ధ్వంసం కాగా, పలువురు వాహన చోదకులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రజలను కాపాడాల్సిన పోలీసులే ఈ విధంగా వ్యవహరించడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top