సీఎం క్యాంపు ఆఫీసులో ఆత్మహత్యాయత్నం

సీఎం క్యాంపు ఆఫీసులో ఆత్మహత్యాయత్నం - Sakshi


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. విషం తాగి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. సందర్శకుల గదిలో పడివున్న అతడిని భద్రతా సిబ్బంది గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు.



ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని చిత్తూరు జిల్లాకు చెందిన గంగులప్ప(50)గా గుర్తించారు. అతడికి ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఏకంగా సీఎం క్యాంపు ఆఫీసులో అతడు ఆత్మహత్యకు యత్నించడం చర్చనీయాంశంగా మారింది. అతడు ఎందుకు ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడో కారణాలు తెలియరాలేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top