ఏపీ రాజధానిపై నోరువిప్పిన చిరంజీవి
గుంటూరు: ఏపీ రాజధాని పేరుతో రైతులకు సమాధి కడుతున్నారని రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల సామూహిక నిరసన దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కనపెట్టి రాజధాని నిర్మాణం చేపట్టడం సరికాదన్నారు.
ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా జూలైలో పర్యటిస్తారని చెప్పారు. ముడుపుల కోసమే పోలవరం ప్రాజెక్టును పక్కనపెట్టి పట్టిసీమ చేపట్టారని చిరంజీవి విమర్శించారు.
సంబంధిత వార్తలు