స్కూల్‌లో బీరువా పడి చిన్నారి మృతి


ప్రొద్దుటూరు:  వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు లోని ఓ ప్రైవేటు స్కూల్ లో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. స్ధానికంగా ఉండే వాణి స్కూల్ లో చెక్క బీరువా పడి ఓ విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. లింగాపురానికి చెందిన భార్గవి అనే చిన్నారి వాణి స్కూల్ లో నర్సీరీ చదువుతోంది. ఈ రోజు ఉదయం ఆడుకుంటున్న చిన్నారిపై బీరువా పడటంతో తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన చిన్నారిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. కాగా , స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల చిన్నారి చనిపోయిందని  బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top