'అచ్చోసిన ఆంబోతుల్లా ప్రజల మీదకు వదిలారు'
శ్రీకాకుళం : తెలుగుదేశం పార్టీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ... టీడీపీ కార్యకర్తలను అచ్చోసిన ఆంబోతుల్లా ప్రజల మీదకు వదిలారని మండిపడ్డారు. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలతో పాటు ప్రజలపైనా దాడులకు దిగుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు పాలన అలీబాబా అరడజను దొంగలను తలపిస్తోందని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు.
జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ ప్రముఖులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాధరావు, ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వంగవీటిరాధాకృష్ణ, ధర్మాన కృష్ణదాస్, ఎం.ఎస్.నాగిరెడ్డి, గౌతంరెడ్డి, చల్లా మధుసూధన్రెడ్డి, బాలరాజు తదితరులు హాజరయ్యారు.