వైఎస్ఆర్సీపీ గెలవటాన్ని భరించలేకే....
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారి పల్లె ఉన్న చంద్రగిరి నియోజక వర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడాన్ని టీడీపీ భరించలేదకపోతోందనని ఆపార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ ఎలాగైనా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించడానికి టీడీపీ కుట్ర చేస్తోందన్నారు. టీడీపీ కుట్రల్లో సభాపతి కోడెల భాగం కాకుండా ఉండాలని కొడాలి నాని విజ్ఞప్తి చేశారు.
కాగా అంతకు ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూతో కలిసి స్పీకర్ కోడెల శివప్రసాద్తో భేటీ అయ్యారు. సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై చర్చించారు. తాను ఎవర్ని కించపరిచేలా మాట్లాడలేదని, సభ అంటే తనకు గౌరవం ఉందని చెవిరెడ్డి తెలిపారు.