రైళ్ల వేళల్లో మార్పులు

రైళ్ల వేళల్లో మార్పులు - Sakshi


విశాఖపట్నం : రైళ్ల రాకపోకల వేళలు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మారబోతున్నాయి. ఇప్పటికే దురంతో ఎక్స్‌ప్రెస్‌తో బాటు పలు రైళ్ల రాకపోకలు మారిన సంగతి తెలిసిందే. తాజాగా మరిన్ని రైళ్ల వేళలు మారినట్టు తూర్పుకోస్తా రైల్వే ప్రకటించింది.  

 

హౌరా/ హైదరాబాద్(ఈస్టుకోస్టు) ఎక్స్‌ప్రెస్ తెల్లవారుజామున 3.55 గంటలకు చేరుకుని 4.15 గంటలకు బయల్దేరుతుంది.

 

 మచిలీపట్నం/నరసాపురం నుంచి విశాఖకు వచ్చే ప్యాసింజర్ ఉదయం 8 గంటలకు చేరుతుంది.

 

 సాంత్రగచ్చి నుంచి ఛెన్నై సెంట్రల్ల్ బై వీక్లీ ఎక్స్‌ప్రెస్  బుధ, శనివారాల్లో ఉదయం 8.10గంటలకు వచ్చి 8.30 గంటలకు బయలుదేరుతుంది.

 

 విజయవాడ-రాయగడ పాసింజర్ ఉదయం 8.20 గంటలకు వచ్చి 8.40 గంటలకు బయలుదేరుతుంది.

 

హటియా-యశ్వంత్‌పూర్ బై వీక్లీ ఎక్స్‌ప్రెస్  సోమ, బుధవారాల్లో, అసన్‌సోల్-చెన్నై ఎక్స్‌ప్రెస్ గురువారం, టాటానగర్-యశ్వంత్‌పూర్ వీక్లీఎక్స్ ప్రెస్ శనివారం, హటియా-యశ్వంత్‌పూర్ వీక్లీఎక్స్‌ప్రెస్ ఆదివారం నడిచే రైళ్లు ఉదయం 9.40 గంటలకు వచ్చి 10 గంటలకు బయలుదేరుతాయి.

 

 దన్‌బాద్/టాటానగర్ - అలెప్పిబొకారో ఎక్స్‌ప్రెస్ ఉదయం 9.55 గంటలకు చేరుకొని 10.15 గంటలకు బయలుదేరుతుంది.

 

 నాందేడ్ / సంబల్‌పూర్ ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్ మంగ,బుధ,ఆదివారాల్లో 10.15 గంటలకు చేరుకొని 10.35 గంటలకు వెళుతుంది.

 

 సంబల్‌పూర్/నాందేడ్ ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్ సోమ,శుక్ర,ఆదివారాల్లో విశాఖకు రాత్రి 7.05 గంటలకు చేరుకొని 7.25 గంటలకు బయలుదేరుతుంది.

 

 విశాఖ-మచిలీపట్నం/నర్సాపూర్ పాసింజర్ రాత్రి 7.45 గంటలకు బయలుదేరుతుంది.

 

 మూడు కొత్త రైళ్లకు చోటు....



విశాఖ, విజయనగరం  మీదుగా మరో మూడు కొత్త రైళ్లు పరుగులు తీయనున్నాయి.  కొత్త రైళ్ల వేళలను కొత్త రైల్వే టైంటేబుల్లో పొందుపరిచింది. హౌరా- యశ్వంత్‌పూర్-హౌరా (22863/64), గాంధీధమ్-పూరి-గాంధీధమ్ (19453/54) రైళ్లు విజయనగరం మీదుగా ప్రయాణిస్తున్నాయి. విశాఖ మీదుగా టాటానగర్-బయ్యపానహలి(బెంగుళూర్)-టాటానగర్ (18111/12) ఎక్స్‌ప్రెస్ నడుస్తుంది.

 

 టాటా నగర్-బయ్యపానహలి(బెంగుళూర్) ఎక్స్‌ప్రెస్ ప్రతీగురువారం టాటానగర్‌లో సాయంత్రం 6.35 గంటలకు బయలుదేరి శుక్రవారంఉదయం 9.40 గంటలకు విశాఖ చేరుకొని, తిరిగి 10 గంటలకు బయలుదేరి  రాత్రి 7 గంటలకు చేరుకుంటుంది.

 

 బయ్యపానహలి (బెంగుళూర్)-టాటానగర్ ఎక్స్‌ప్రెస్ ప్రతీ ఆదివారం ఉదయం 9.15 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 7.55 గంటలకు విశాఖ చేరుకొని తిరిగి 8.15 గంటలకుబయలుదేరి సోమవారం మధ్యాహ్నం 12.35 గంటలకు టాటా చేరుతుంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top