బిషన్ పార్క్ సందర్శించిన చంద్రబాబు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్లో రెండో రోజు పర్యటిస్తున్నారు. బిషాన్ పార్క్, టోపయా టౌన్లో ప్రాంతాలను సందర్శించిన చంద్రబాబు బృందం... డ్రైనేజీ నిర్వహణకు వినియోగిస్తున్న టెక్నాలజీపై అధ్యయనం చేసింది. సింగపూర్లో అమలు చేస్తున్న యాక్టివ్ బ్యూటిఫుల్ క్లీన్... ఏబీసీ పాలసీని సింగపూర్ అధికారులు చంద్రబాబుకు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని పలు నగరాల్లో ఈ విధానం అమలుకు చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా సింగపూర్ నిపుణుల సాయం కోరారు. సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డును కూడా చంద్రబాబు బృందం సందర్శించింది.
కాగా ఏపీ కొత్త రాజధాని నిర్మాణ తొలి దశ మాస్టర్ప్లాన్ బ్లూప్రింట్ను సింగపూర్ సంస్థలు చంద్రబాబుకు అందచేశాయి. సింగపూర్లో పర్యటిస్తున్న బాబుకు నిన్న ఆ దేశ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ బ్లూప్రింట్ను అందించారు.