'వందరోజుల పాలనలో 101 అబద్ధాలు'

'వందరోజుల పాలనలో 101 అబద్ధాలు' - Sakshi


హైదరాబాద్: రుణమాఫీ పేరుతో రైతులకు సీఎం చంద్రబాబు టోపి పెట్టారని ఆంధ్రప్రదేశ్ పీపీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి విమర్శించారు. చంద్రబాబు వంద రోజుల పాలనపై పీసీసీ తయారుచేసిన వాస్తవపత్రాన్ని సోమవారం ఆయన విడుదల చేశారు.



ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు వందరోజుల పాలనలో 101 అబద్ధాలు ఆడారని ఆరోపించారు. వందరోజుల్లో సిమెంట్ ధర రూ.100 పెంచారని గుర్తు చేశారు. మంత్రివర్గంలో పెట్టుబడిదారలకే చోటు కల్పించారని అన్నారు. మంత్రివర్గ సమావేశాలను దిగజార్చారని రఘువీరా దుయ్యబట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top