చంద్రబాబు నిర్ణయంపైనే రాజధాని ఏర్పాటు
కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయంపైనే రాజధాని ఏర్పాటు ఆధారపడి ఉంటుందని నీటిపారుదల, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ చెప్పారు. రాజధాని ఏర్పాటుపై కేబినెట్లో చర్చిస్తామన్నారు.
కృష్ణా ట్రిబ్యునల్ బోర్డు ఏర్పాటుపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఎస్ఆర్బీసీ, హంద్రీనీవా, సిద్ధాపురం లిప్ట్ ఇరిగేషన్ పనులు త్వరగా పూర్తి చేస్తామన్నారు. రాయలసీమలో తాగునీటి సమస్య ఉందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి ఉమ చెప్పారు.