వచ్చే నెలలో సీఎం స్విట్జర్లాండ్ పర్యటన


చంద్రబాబుతో పాటు మంత్రి యనమల, కంభంపాటి

 సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగర పర్యటనకు వెళుతున్నారు. అక్కడ జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు. చంద్రబాబుతో పాటు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జేఎస్‌వి ప్రసాద్, పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్, ముఖ్యమంత్రి ఓఎస్‌డీ వెంకయ్య చౌదరి దావోస్‌కు వెళ్లనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top