బెజవాడలో రేపు బాబు 2 కి.మీ పాదయాత్ర


విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడలో 2 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. అక్టోబర్ 2 నుంచి 'జన్మభూమి-మా ఊరు' కార్యక్రమం సందర్భంగా ఆయన ఈ యాత్ర చేపట్టనున్నారు. జన్మభూమితో  పాటు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ సుజల, ఎన్టీఆర్ భరోసా తదితర కార్యక్రమాలను చంద్రబాబు ప్రారంభించనున్నారు. సీఎంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు ఉన్నతాధికారి కూడా జన్మభూమిలో పాల్గొంటారు. కాగా  ఈ నెల 2వ తేదీ నుంచి 20 వరకూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జన్మభూమి కార్యక్రమం నిర్వహించనున్నారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top