ఢిల్లీ బయల్దేరిన చంద్రబాబు

ఢిల్లీ బయల్దేరిన చంద్రబాబు


అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం రాష్ట్రపతిగా రామ్‌నాధ్ కోవింద్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారని, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల విడుదలపై వారితో చర్చించనున్నారని తెలుస్తోంది.



ప్రధానంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, హోం మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్, ఉక్కు ఖనిజ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్, మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్లతో  చంద్రబాబు భేటీ కానున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top