అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా పుట్టపర్తి


అనంతపురం : పుట్టపర్తిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మార్చుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన శుక్రవారం పుట్టపర్తిలోని సత్యసాయిబాబా మహా సమాధిని సందర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పుట్టపర్తి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని హామీ ఇచ్చారు.



కాగా హంద్రీ-నీవా ప్రాజెక్టు పనుల పరిశీలన నిమిత్తం చంద్రబాబు జిల్లాలో పర్యటిస్తున్నారు. బెళుగప్ప మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్ వద్ద పంపింగ్ హౌస్, అక్విడెక్ట్ పనులను పరిశీలించనున్నారు. అనంతరం అక్కడే హంద్రీ-నీవా, గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుల పనుల తీరుపై నీటి పారుదలశాఖ అధికారులతో సమీక్షిస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top