'చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య వెన్నుపోటు'
విజయవాడ: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వెన్నతోపెట్టిన విద్య వెన్నుపోటు అని పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. వందరోజుల పాలనలో చంద్రబాబు మాటతప్పారన్నారు. రాష్ట్రంలో ఉన్నది ప్రజా సంక్షేమ ప్రభుత్వం కాదని, ప్రజావంచన ప్రభుత్వంలా ఉందని మండిపడ్డారు.
ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన ఘనత చంద్రబాబుదన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని అటకెక్కించారని దుయ్యబట్టారు. చంద్రబాబు వచ్చాక ఉద్యోగాలు పోయాయని బొత్స చెప్పారు.
**