మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రానికి రావల్సిన నిధుల కోసం ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున నిధులు రాబట్టే యోచనలో చంద్రబాబు ఉన్నారు.