త్వరలో సీఎం బాబు విదేశీ పర్యటనలు

త్వరలో సీఎం బాబు విదేశీ పర్యటనలు - Sakshi


సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమం త్రి చంద్రబాబు నవంబర్, డిసెంబర్ నెలల్లో వరుసగా విదేశాల్లో పర్యటించనున్నారు. ‘మేక్ ఆంధ్రప్రదేశ్’ నినాదంతో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, ఐటీ సహా పలు కంపెనీలను ఏపీకి ఆహ్వానించడం లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. కంపెనీలవారితో చర్చలు, రోడ్డు షోలు నిర్వహించనున్నారు. ముందుగా చైనా, జపాన్, సింగపూర్, మలేషియాలలో చంద్రబాబు పర్యటిస్తారు. ఇందుకు సంబంధించి ఎప్పుడు ఏ దేశానికి వెళ్తారన్న తుది షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని అధికారవర్గాలు వివరించాయి. 2015 ఏప్రిల్, మే నెలల్లో అమెరికాలో చంద్రబాబు పర్యటించనున్నారు. డిసెంబర్లో విశాఖకు సత్యనాదెళ్ల రాక: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల డిసెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. విశాఖలో జరిగే ఐటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన నున్నారు. ఆ సందర్భంగా ఆయన చంద్రబాబుతో భేటీ అవుతారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top