రేపటి నుంచి చంద్రబాబు హస్తిన పర్యటన

చంద్రబాబు నాయుడు


న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపటి నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం జపాన్ వాణిజ్య బృందంతో చంద్రబాబు సమావేశమవుతారు.



ఈ నెల 30వ తేదీ గురువారం స్వచ్ఛభారత్ అమలుపై నీతి అయోగ్ సమావేశం జరుగుతుంది. ప్రణాళికా సంఘం స్థానంలో నీతి అయోగ్ అనే సంస్థను కేంద్రం ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఈ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top