'ప్రజలను మోసం చేసిన చంద్రబాబు'
విశాఖపట్నం: మేనిఫెస్టో విషయంలో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఏపిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి విమర్శించారు. గోపాలపట్నంలోని కుమారి కళ్యాణ మండపంలో కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో రఘువీరా రెడ్డితోపాటు ఎంపి కెవిపి రామచంద్ర రావు, పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రఘువీరా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వ వైఫల్యం వల్ల విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై ఆందోళన చేయనున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాయాల ఎదుట ఆగష్టు 4న ధర్నాలు చేస్తామని రఘువీరారెడ్డి చెప్పారు.