ప్రతినెల ఒకరోజు జీతం ఇవ్వాలి...
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ఉద్యోగులు 'ప్రతి నెల ఒక రోజు జీతం రాజధానికి ఇవ్వాలి' అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే విరాళాలను ప్రతినెలా ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. చంద్రబాబు నాయుడు గురువారం సచివాలయంలో మంత్రులు, అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతి తీర్మానాన్ని వీడియో కాన్ఫరెన్స్లో అధికారులకు వివరించారు. ప్రతి ఊరు, ప్రతి వ్యక్తి రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. కనీసం ఒక్క ఇటుకైనా సాయం చేయాలని ఆయన కోరారు. రెండు అంకెల వృద్ధి శాతం సాధించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.