మీడియాపై మండిపడిన చంద్రబాబు
హైదరాబాద్: ''రాజధాని విషయంలో మీడియా ఇష్టానుసారం రాసుకుంటే నేను స్పందించాలా?'' అని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇంకా రాలేదని చెప్పారు. నివేదిక రాకుండా మాట్లాడమంటే ఏం మాట్లాడాలి? అని ప్రశ్నించారు.
''ఒకరు వినుకొండ, మరొకరు దొనకొండ, ఇంకొకరు మాచర్ల అని మీరే రాసుకుంటున్నారు. మీ వద్ద నివేదిక ఉంటే చూపించడండి'' అని చంద్రబాబు మీడియాకు ఎదురు ప్రశ్నలు వేశారు.తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.