'గన్కల్చర్ ను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు'
విజయవాడ: రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడతామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గన్ కల్చర్ ను ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు.
దుర్గామల్లేశ్వరస్వామి ఆలయానికి చెందిన 14 ఎకరాల భూమిని సిద్ధార్థ్ కాలేజీ యాజమాన్యం అక్రమంగా వాడుకుంటోందని తెలిపారు. ఆ భూములను ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. అధికారులపై ఒత్తిడి పెంచి పెన్షన్ కార్డులు తొలగిస్తున్నారని ఆయన మండిపడ్డారు.