నేటి నుంచి నంద్యాలలో చంద్రబాబు ప్రచారం
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబునాయుడు శనివారం నుంచి రెండురోజులపాటు నంద్యాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. శుక్రవారం సాయంత్రం విజయవాడ నుంచి తిరుపతి వెళ్లిన చంద్రబాబు అటు నుంచి శనివారం ఉదయం నంద్యాల చేరుకుంటారు. ఉదయం 10.30 గంటలకు నంద్యాల రూరల్ మండలం అయ్యలూరు బహిరంగసభతో తన ప్రచారాన్ని ప్రారంభిస్తారు.
తర్వాత పలు ప్రాంతాల్లో రోడ్షోలలోను, సూరజ్ గ్రాండ్ సర్కిల్, గాంధీచౌక్ వద్ద జరిగే సభల్లోనూ ఆయన పాల్గొంటారు. 20వ తేదీన కూడా చంద్రబాబు నంద్యాలలో ప్రచారం నిర్వహిస్తారు.