'200 హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు'

'200 హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు' - Sakshi


అనంతపురం: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన 200 హామీల్లో ఇప్పటివరకు ఏ ఒక్కటీ నెరవేరలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. లక్షా 30 వేల కోట్ల రూపాయల రుణాలుంటే ప్రభుత్వం కేవలం రూ. 5 వేల కోట్లు కేటాయించడం సమంజసమా అని ప్రశ్నించారు. రుణమాఫీ త్వరగా జరగాలన్నదే తమ పార్టీ ఉద్దేశమని అన్నారు. నవంబర్ 5న నిర్వహించనున్న ధర్నాలను విజయవంతం చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.



వైఎస్సార్ సీపీ జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... చిత్తశుద్ధితో పనిచేసే కార్యకర్తలకు పార్టీలో అన్నివిధాలా ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. వైఎస్సార్ సీపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామని అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top