అసెంబ్లీలో చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలపై అనుచిత, అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ చంద్రబాబు అలగాజనం అంటూ సంబోధించారు.
చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు సభా హక్కుల నోటీసు ఇవ్వాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు యోచిస్తున్నారు. బడ్జెట్ పద్దులపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడకుండా అధికార పార్టీ సభ్యులు పలుమార్లు అడ్డుతగిలారు. వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పకుండా ఎదురుదాడికి దిగారు. చర్చను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు.