ఎట్ హోంలో చంద్రబాబు, కేసీఆర్


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, చంద్రశేఖర్ రావు మరోసారి కలిశారు. రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్భవన్లో జరిగిన ఎట్ హోం కార్యక్రమం ఇందుకు వేదికైంది.



గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల సీఎంలతో పాటు స్పీకర్లు, మంత్రులు, డీజీపీలు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, కేసీఆర్ పలు విషయాల గురించి చర్చంచుకున్నారు. చంద్రబాబు, కేసీఆర్.. గవర్నర్కు చెరో పక్కన ఆశీనులయ్యారు. ఇరు రాష్ట్రల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి గవర్నర్ చొరవజూపారు.  ఈ కార్యక్రమం అనంతరం గవర్నర్.. చంద్రబాబు, కేసీఆర్లతో ప్రత్యేకంగా సమావేశమై పలు విషయాల గురించి చర్చించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top