ఆకర్షక మంత్రం జపించిన చంద్రబాబు


ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలు, కార్యకర్తలను మనవైపు తిప్పుకోవాలంటూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకర్షక మంత్రాన్ని జపించారు. విజయవాడలో జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పదే పదే ఇదే విషయం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మొత్తం 50 అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని, అందువల్ల పార్టీకి మరింతగా కేడర్ అవసరం అవుతుందని ఆయన అన్నారు.



అందుకే ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలు, కార్యకర్తలను ఆహ్వానించాలని తెలిపారు. అయితే అలా వలస వచ్చేవారి వల్ల మీ స్థానాలకు ఢోకా ఏమీ ఉండబోదని కూడా ఆయన కార్యకర్తలతో అన్నారు. అయితే.. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుతో పాటు రాష్ట్ర మంత్రులు కేఈ కృష్ణమూర్తి, గంటా శ్రీనివాసరావు తదితరులు గైర్హాజరయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top