'రాజధాని ఎంపికతో కేంద్రానికి సంబంధం లేదు'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎంపికతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యి చర్చించుకోవడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయనే భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు తనను ఆహ్వానించకపోవడం వల్లనే తాను ఆయనను కలవలేదని, అయితే కేసీఆర్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని అశోక్ గజపతి రాజు చెప్పారు. ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తే విమానాశ్రయాలకు దివంగత ఎన్టీఆర్ పేరు పెట్టడంపై ఆలోచిస్తామని ఆయన అన్నారు.
సంబంధిత వార్తలు