సమైక్యవాదులపై 725 కేసుల ఎత్తివేత


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజనకు ముందు సంయుక్త ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేసిన వారిపై నమోదైన కేసులను ఎత్తివేసింది.



725 కేసులను ఎత్తివేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు సీమాంధ్రలో పెద్ద ఎత్తున సమైక్యాంధ్ర ఉద్యమం జరిగిన సంగతి తెలిసిందే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top