కారు-ఆటో ఢీ, ఇద్దరు మృతి
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం అల్లంపురం వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు, ఆటో ఒకదానికొకటి ఢీ కొనటంతో ఈ ప్రమాదం జరిగింది. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.